Sunday, April 28, 2024

తెలంగాణ డిజిటల్ మీడియాకు ఐదు పిఆర్‌సిఐ ఎక్సలెన్స్ అవార్డులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ప్రతిష్టాత్మక పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎక్సలెన్స్ అవార్డులను ఐదు విభాగాలలో గెలుచుకుంది. ఈ విభాగం డైరెక్టర్ దిలీప్ కొణతంకు పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది. అంతేగాకుండా తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం మరో నాలుగు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈనెల 21, 22వ తేదీలో జరిగిన 17వ గ్లోబల్ కమ్యూనికేషన్ కాంక్లేవ్‌లో ఈ అవార్డులను ప్రదానం చేశారు. మాజీ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చేతుల మీదుగా డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ దిలీప్ కొణతం సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సామాజిక మాధ్యమాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డును పీఆర్సీఐ అందజేస్తుంది. అవార్డులను సోషల్ మీడియా ఉత్తమ వినియోగం అవార్డు, ఉత్తమ వార్షిక నివేదిక అవార్డు , ప్రజా సేవల ప్రకటనల అవార్డు, ఉత్తమ ప్రభుత్వ కమ్యూనికేషన్ ఫిలమ్స్‌లకు అందిస్తారు. తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం తరపున సహాయ సంచాలకులు, డిజిటల్ మీడియా ముడుంబై మాధవ్, డిజిటల్ మీడియా కన్సల్టెంట్ నరేందర్ గుండ్రెడ్డి ఈ అవార్డులు అందుకున్నారు.
డిజిటల్ మీడియా విభాగం గురించి: ఐటీ శాఖకు చెందిన డిజిటల్ మీడియా విభాగం జూన్, 2014లో ఏర్పాటు చేయబడింది. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం, సేవలను డిజిటల్ మధ్యమాలలో పౌరులకు చేరవేయడం ఈ విభాగం ప్రధాన బాధ్యత. సామాజిక మధ్యమాల ఖాతాల సృష్టి, నిర్వహణ వెబ్‌సైట్‌లు, పోర్టల్‌ల రూపకల్పన, అభివృద్ధి నిర్వహణ ఓపెన్ గవర్నమెంట్ డేటా, కంటెంట్ స్థానికీకరణ, ఫ్యాక్ట్ చెక్, తెలంగాణ డిజిటల్ రిపాజిటరీ కార్యక్రమాల అమలు డిజిటల్ మీడియా విభాగం ఇతర ప్రధాన విధులు. సాంకేతిక సంస్థల నిపుణులచే ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి సామాజిక మధ్యమాలపై శిక్షణా కార్యక్రమాలను డిజిటల్ మీడియా విభాగం నిర్వహిస్తుంది.

Award 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News