Sunday, April 28, 2024

రూ.13,545 కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

- Advertisement -
- Advertisement -

కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి

మనతెలంగాణ/ హైదరాబాద్ : నాకు బిఆర్‌ఎస్ నేతల సర్టిఫికేట్ అవసరం లేదు అని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రీజినల్ రింగ్ రోడ్డు తీసుకువచ్చాను.. కనీసం భూ సేకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు.. ప్రధాన మంత్రితో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి కనీసం సిఎం కెసిఆర్ రావడం లేదు.. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా?.. అని ఆయన ప్రశ్నించారు. బిజెపిని ఇరకాటంలో నెట్టడానికి బిఆర్‌ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారు.. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి హైదరాబాద్ వేదికగా వ్యవసాయ మోటర్లకు మీటర్లుండవని స్పష్టంగా ఈ విషయం చెప్పినా.. మళ్లీ మళ్లీ దుష్ప్రచారం చేస్తున్నారు.పసుపు బోర్డ్ పై వెయిట్ అండ్ సీ.. దున్నపోతుకు గడ్డి వేసి.. ఆవుకు పాలు ఇవ్వమంటే ఎలా ఇస్తుంది.. రాజకీయాలపై ఉన్న శ్రద్ధ కెసిఆర్‌కి తెలంగాణ ప్రజలపై లేదు.. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందో గన్ పార్క్ దగ్గర కెసిఆర్ తో బహిరంగ చర్చకు సిద్ధం అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. బండి సంజయ్ ఇంటి మీద మజ్లిస్ కార్యకర్తలు చేసిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. బిఆర్‌ఎస్, వాళ్ల మిత్రులు కలిసి చేస్తున్న దుందుడుకు చర్యలకు, తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఒకటిన పాలమూరులో.. 3న ఇందూరులో..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకటో తేదీన పాలమూరులో.. 3వ తేదీన ఇందూరులో పర్యటిస్తారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, పూర్తయిన పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో.. ప్రధాని మోడీ చేతుల మీదుగా రూ.13,545 కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రూ.505 కోట్లతో నిర్మించిన మునీరాబాద్,-మహబూబ్‌నగర్ ప్రాజెక్టులో భాగమైన.. ‘జక్లేర్ -కృష్ణ’ కొత్త లైన్‌ను జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్-, గోవా మధ్య 102 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. కృష్ణ స్టేషన్ నుంచి ‘కాచిగూడ ,- రాయచూర్, – కాచిగూడ’ డెమూ సర్వీస్‌ను ప్రారంభిస్తారు. జాతీయ రహదారులకు సంబంధించిన రూ. 6,404 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.2,457 కోట్లతో నిర్మించిన ఎన్‌హెచ్ 365 బిబిలో భాగమైన సూర్యాపేట- ఖమ్మం నాలుగు లైన్ల రహదారిని ప్రారంభిస్తారు. దీంతో పాటుగా రూ.2,661 కోట్ల విలువైన.. హసన్ (కర్ణాటక), – చర్లపల్లి హెచ్‌పిసిఎల్ ఎల్‌పిజి పైప్‌లైన్ ను జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా.. 37 లక్షల మంది వినియోగదారులకు గ్యాస్ అందించే వెసులుబాటు ఉంది. రాష్ట్రంలో 230 కిలోమీటర్ల మేర ఈ పైప్‌లైన్ ఉండగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే 130 కిలోమీటర్ల మేర ఈ పైప్ లైన్ ఉంటుంది. తిమ్మాపూర్ లోని ఐఓసిఎల్ ప్లాంటుకు ఈ పైప్‌లైన్ ను కనెక్ట్ చేస్తే.. అదనంగా మరో 35 లక్షల మంది వినియోగదారులకు గ్యాస్ అందించే అవకాశం ఉంది. దీంతోపాటుగా.. రూ. 1,932 కోట్లతో.. కృష్ణపట్నం (ఆంధ్రప్రదేశ్) – హైదరాబాద్ మధ్య ‘మల్టీ ప్రాడక్ట్ పైప్‌లైన్’కు (డీజిల్, పెట్రోల్, కిరోసిన్, జెట్ ఫ్యూయల్..) శంకుస్థాపన చేస్తారు. ఇది రాష్ట్ర భవిష్యత్ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రూ.81.27 కోట్లతో..
ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి మరో కానుకను అందించారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రూ.81.27 కోట్లతో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ & స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, స్కూల్ ఆఫ్ ఆరట్స్ & కమ్యూనికేషన్స్ భవనాలను ప్రధాని వర్చువల్ గా ప్రారంభిస్తారు. దేశంలో మౌలికవసతుల కల్పనను వేగవంతం చేసేందుకు ప్రధానమంత్రి మోదీ గారు ‘హీరా’ మోడల్ ( హైవేస్, ఇన్ఫోవేస్, రైల్వేస్, ఎయిర్‌వేస్) అభివృద్ధితో ముందుకెళ్తున్నారు. తెలంగాణకు రికార్డు స్థాయిలో రూ.లక్షా పదివేల కోట్ల విలువైన (1.10 లక్షల కోట్లు) జాతీయ రహదారులను కేటాయించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తెలంగాణలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే.. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ 9 ఏండ్లలోనే 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు రాష్ట్ర ప్రజలకు వినియోగంలోకి వచ్చాయి. మరో 2200 కిలోమీటర్ల హైవేలు నిర్మాణంలో ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణతో…
ఆర్‌ఆర్‌ఆర్ వంటి పలు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు 50 శాతం నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినా.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించని కారణంగా ఈ ప్రాజెక్టులు నిలిచిపోతున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.31,221కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. ఎయిర్‌పోర్టుల నిర్మాణం విషయంలోనూ.. కేంద్రం చిత్తశుద్దితో పనిచేస్తోంది. నిజామాబాద్ పర్యటనలో రూ. 8021 కోట్ల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించడం, జాతికి అంకితం చేస్తారు. రామగుండంలోని ఎన్‌పిటిసిలో రూ.6వేల కోట్లతో నిర్మించిన 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తారు. ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్తులో 85 శాతం (680 మెగావాట్లు) తెలంగాణలోనే వినియోగిస్తారు.వచ్చే డిసెంబర్ నాటికి రెండో ప్రాజెక్టు కూడా పూర్తికానుంది. పునరుత్పాద విద్యుత్ (రిన్యువబుల్ ఎనర్జీ)కు కేంద్రం ప్రత్యేక సహకారం అందిస్తోందన్నారు.
రూ. 1,369 కోట్లతో.. 496 బస్తీ దవాఖానాలు..
రాష్ట్రంలో రూ. 1,369 కోట్లతో.. 496 బస్తీ దవాఖానాలు, 33 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీస్ తో పాటుగా.. 31 జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో.. 50/100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ లను నిర్మించాలనేది ప్రధానమంత్రి మోడీ సంకల్పం అని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా.. 20 జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌లో భాగంగా రూ. 516.5 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ లకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.

రూ.305 కోట్లతో 348 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ (ఎలక్ట్రిఫికేషన్) పూర్తయిన.. ధర్మాబాద్ (మహారాష్ట్ర) -మనోహరాబాద్, మహబూబ్‌నగర్ – కర్నూల్ రైల్వే లైనును. జాతికి అంకితం చేస్తారు. రూ. 1200 కోట్లతో 76 కిలోమీటర్ల మీర నిర్మించిన మనోహరాబాద్- సిద్దిపేట కొత్త రైల్వే లైనును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన త్వరలోనే చేస్తారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. 26వేల కోట్లతో రీజనల్ రింగు రోడ్డు తీసుకొస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు గజం భూమి కూడా సేకరించి ఇవ్వలేదని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News