Saturday, July 27, 2024

వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి: వాసుదేవ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి అమలు చేస్తున్న ఉచిత బస్ సౌకర్యం మహిళలతో పాటు వికలాంగులకు కూడా వర్తింపజేయాలని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె. వాసుదేవ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం అమలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.

సమాజంలో మిగతా వర్గాల కంటే ఎక్కువగా వికలాంగులు వెనుకబడి ఉన్నారని వీరిని ఆదుకోవడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 4016 పెన్షన్ తో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేసిందని కొనియాడారు. రాష్ట్రంలో దాదాపుగా 6 లక్షల మంది వికలాంగుల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని వీరికి ఇప్పటికే 50 శాతం రాయితీతో బస్ పాస్ సౌకర్యం ఉందని, వీరికి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించినట్లయితే వికలాంగులు మరింత ఎదగడానికి అవకాశం ఉంటుందన్నారు. వికలాంగులకు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి పెద్ద భారం పడదని ఉచిత బస్ సౌకర్యాన్ని అమలుచేయాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News