Monday, April 29, 2024

భావ ప్రకటనా స్వేచ్ఛ విద్వేషపూరిత ప్రసంగంగా మారకూడదు

- Advertisement -
- Advertisement -
సనాతన ధర్మంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

చెన్నై: సనాతన ధర్మంపై డీఎంకే నేత తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో సనాతన ధర్మంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సనాతన ధర్మం అనేది దేశం, రాజు, తల్లిదండ్రులు, గురువు, పేదల పట్ల శ్రద్ధతోసహా నిత్య కర్తవ్యాల సమాహారమని వ్యాఖ్యానించింది. తమిళనాడు లోని తిరువారూర్ పట్టణంలో గల ఓ ప్రభుత్వ కాలేజీ సనాతన వ్యతిరేకత అనే అంశంపై విద్యార్థులు తమ ఆలోచనలను పంచుకోవాలని ఓ సర్కులర్ జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఇళంగోవన్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్ శేషసాయి ధర్మాసనం సనాతన ధర్మ కేవలం కులతత్వాన్ని, అంటరానితనాన్ని ప్రోత్సహించడమేనన్న భావన బలపడిందని అన్నారు. ఆ భావనను తాను గట్టిగా తిరస్కరిస్తున్నట్టు తెలిపారు. ‘ సమాన పౌరులున్న సమాజంలో అంటరానితనాన్ని సహించలేం.

సనాతన ధర్మంలో ఎక్కడో ఒకచోట అంటరానితనాన్ని అనుమతించినా, రాజ్యాంగం లోని ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిర్మూలిస్తుంది. వాక్ స్వాతంత్య్రం ప్రాథమిక హక్కు అయితే , అది ద్వేషపూరిత ప్రసంగంగా మారకూడదు. ప్రతీమతం విశ్వాసం ఆధారంగా స్థాపించబడింది. దాని స్వభావం ద్వారా విశ్వాసం అహేతుకతను కలిగి ఉంటుంది. కాబట్టి మతానికి సంబంధించిన విషయాల్లో భావ ప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించినప్పుడు ఎవరి మనసూ గాయపడకుండా చూసుకోవడం అవసరం. మరో మాటలో చెప్పాలంటే , భావప్రకటనా స్వేచ్ఛ విద్వేషపూరిత ప్రసంగంగా మారకూడదు’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News