Sunday, April 28, 2024

మండపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలు పాటించండి

- Advertisement -
- Advertisement -
టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమా రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్: వినాయక చవితి పండుగ సందర్భముగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా మరియు భద్రతా పరంగా విద్యుత్ శాఖ చేపట్టిన పనులను చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జి.రఘుమా రెడ్డి సమీక్షించారు. సెప్టెంబర్ 18 నుండి ప్రారంభమయ్యే గణేష్ పండుగ ఉత్సవాలు 11 రోజుల పాటు నిర్వహిస్తారు. మండపాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా మరియు భద్రతా కోసం తమ సంస్థ తగు ఏర్పాట్లు చేసిందన్నారు. సామాన్య ప్రజలు, భక్తులు మరియు మండప నిర్వాహకులు మండపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలని కోరారు. మండపాలకు విద్యుత్ సరఫరా కనెక్షన్ కోసం సామాన్యులు స్తంభాలు ఎక్కరాదు. సంస్థ సిబ్బంది ద్వారానే విద్యుత్ కనెక్షన్ పొందలని,ఐఎస్‌ఐ మార్కు మార్క్ ఉన్న ప్రామాణిక విద్యుత్ వైర్లను మాత్రమే వాడాలన్నారు. ఎటువంటి జాయింట్ వైర్లు వాడకూదని, తగినంత కెపాసిటీ కలిగిన ఎంసిబిని తప్పనిసరిగా వాడాలని, ఇది విద్యుత్ ప్రమాదాల నుండి రక్షణ ఇస్తుందన్నారు.మండపాల్లో విద్యుత్ సంబంధిత పనులు చేసేటప్పుడు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.

విద్యుత్ వైర్ల/ పోల్స్ మరియు ఇతర ప్రమాదకర విద్యుత్ పరికరాల నుండి పిల్లల్ని దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.ఒక వేళ ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలితే వారికి వెంటనే వైద్య సహాయం అందించి, ఆ ప్రమాదం గురించి దగ్గరలోని విద్యుత్ సిబ్బందికి తెలియచేయాలని సూచించారు.విద్యుత్ వైరింగ్ లో ఎక్కడైనా లీకేజ్ ఉంటే, వర్షాలు కురిసినప్పుడు తేమతో షాక్ కొట్టే అవకాశం ఉందని,కనుక మండప నిర్వాహకులు ప్రతి రోజు తప్పనిసరిగా వైరింగ్ ను క్షుణ్ణంగా పరిశీలించాన్నారు. విద్యుత్ లైన్స్ ఎక్కడైనా తెగి పడ్డా, ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే 1912 / 100 / సమీప ప్యూజ్
ఆఫ్ కాల్ కు కాల్ చేసి విద్యుత్ సిబ్బందికి తెలియచేయలన్నారు .విద్యుత్ వినియోగదారులకు, సామాన్య ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సంస్థ చైర్మన్ సీఎండి రఘుమారెడ్డి రఘుమా రెడ్డి స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ పండుగను సుఖసంతోషాలతో సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News