Friday, May 10, 2024

ఎసిబి వలలో సబ్ రిజిస్ట్రార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/గంగాధర : రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్‌తోపాటు ఆఫీస్ సబార్డినేట్ ఎసిబి అధికారులకు చిక్కారు. వివరాల్లోకి వెళ్తే..రాజన్న సిరిసిల్ల జిల్లా, వెంకంపేట గ్రామానికి చెందిన కొక్కుల అజయ్ కుమార్ అనే వ్యక్తి కరీంనగర్ జిల్లా, కొత్తపల్లి మండలం, రేకుర్తి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 131లో 486.42 చదరపు గజాల భూమికి గిఫ్ట్ డీడ్ చేయడానికి తన మిత్రుడు ఆకుల అంజయ్య ద్వారా ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్ శివారం సురేష్ బాబును సంప్రదించారు. అయితే గిఫ్ట్ డీడ్ చేయడానికి రూ.10 వేలు డిమాండ్

చేయడంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. శనివారం ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్ సూచనల మేరకు రూ.10 వేలు కార్యాలయంలోని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి, ఆఫీస్ సబార్డినేట్‌గా పని చేస్తున్న కొత్తకొండ శ్రీధర్‌కు బాధితుడు ఇచ్చాడు. వెంటనే ఎసిబి అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ సురేష్ బాబు, ఆఫీస్ సబార్డినేట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి కొత్తకొండ శ్రీధర్‌పై కేసు నమోదు చేశామని ఎసిబి డిఎస్‌పి రమణమూర్తి తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News