Monday, May 20, 2024

వేయని రైతుభరోసాను వేసినట్టు ఎందుకీ అబద్ధాలు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రాహుల్ గాంధీ భ్రమలో ఉన్నారా, తెలంగాణ ప్రజలతో డ్రామా ఆడుతున్నారా, వేయని రైతుభరోసాను వేసినట్టు ఎందుకీ అబద్ధాలు, ఎంతకాలం ఈ అసత్యాలు అంటూ ఎక్స్ ట్విట్టర్ వేదికగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. ఎక్కడన్నా ఒక్క రైతుకైనా వచ్చినదా ఎకరానికి రూ.7.500 అంటూ నిలదీశారు. నాట్ల నాడు ఇయ్యాల్సిన పెట్టుబడి సాయాన్ని పార్లమెంట్ ఓట్ల దాకా డైలీ సీరియల్‌లా సాగదీశారని ఎద్దేవా చేశారు. చివరికి పాత రైతుబంధు పూర్తిగా అందలేదని, రైతు భరోసా కైతే అసలు అడ్రస్సే లేదని దుయ్యబట్టారు. నాడు 15 లక్షలు వేస్తానన్న బడాభాయ్ వేయలేదని, నేడు 15 వేలు ఇస్తానన్న ఛోటాబాయ్ ఇయ్యలేదని ఎద్దేవా చేశారు. మరి రైతు భరోసా వేసినట్టు ఎందుకీ ఫోజులు, అసత్యాలపై కాంగ్రెస్ స్వారీ ఇంకెన్ని రోజులు అంటూ నిలదీశారు.

డిసెంబర్ 9న చేస్తానన్న రెండు లక్షల రుణమాఫీ జాడేది ? అని ప్రశ్నించారు. కౌలు రైతులకు, కూలీలకు చేస్తామన్న సాయం సంగతేది ? అని ప్రశ్నించారు. ఇదేనా మీరు చెప్పిన ప్రజా పాలన, నమ్మి ఓటేసిన పాపానికి ఏంటి ఈ నయవంచన అంటూ నిలదీశారు. ఇది ప్రజాపాలన కాదు, ముమ్మాటికీ ఇది ప్రజా వ్యతిరేక పాల న అని అన్నారు. 420 మోసపూరిత వాగ్దానాలతో నాలుగుకోట్ల ప్రజలను వంచించిన పాలనగా అభివర్ణించారు. ఒక్క మాట మాత్రం నిజం, గాలిమాటల గ్యారెంటీలను నమ్మి, అసెంబ్లీ ఎన్నికల్లో ఆగమైంది తెలంగాణ అని పేర్కొన్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాచైతన్యం వెల్లివిరుస్తోందని, తెలంగాణకున్న ఏకైక గొంతుక బిఆర్‌ఎస్ వైపే ప్రజాతీర్పు ప్రతిధ్వనిస్తుందని వెల్లడించారు. జై తెలంగాణ, జై భారత్, జై బిఆర్‌ఎస్ అని నినదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News