Sunday, April 28, 2024

ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావు హత్య

- Advertisement -
- Advertisement -
ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధించిన భద్రాచలం కోర్టు

హైదరాబాద్ : ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావు హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ భద్రాచలం కోర్టు గురువారం తీర్పును వెల్లడించింది. 2022లో ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావు హత్యకు గురైన విషయం తెలిసిందే.2022 లో చంద్రుగొండ మండలం ఎర్రబోడు అటవీ ప్రాంతంలో పోడు భూముల విషయమై ఆదీవాసీలకు , అటవీశాఖాధికారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆదీవాసీల దాడిలో అటవీశా ఖాధికారి శ్రీనివాసరావు మృతి చెందారు. శ్రీనివాసరావు హత్య కేసులో మడకం తుల, మిడియం నంగాలను కోర్టు దోషులుగా తేల్చింది. వీరిద్దరికి జీవితఖైదుతో పాటు వెయ్యి రూపాయాల జరిమానాను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఎర్రబోడులో గుత్తికోయలు మొక్కలు నాటు తున్న విషయాన్ని తెలుసుకున్న ఎఫ్‌ఆర్‌ఓ అక్కడికి వెళ్లారు.

ఈ విషయమై అటవీశాఖాధికారులతో గుత్తికోయలు దాడికి దిగారు.ఆదివాసీల దాడిలో ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఖమ్మం ఆసుపత్రిలో ఆయన మరణించారు. ఈ ఘటన 2022 నవంబర్ మాసంలో చోటు చేసుకుంది. హత్యకు గురైన ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు పిల్లలు న్నారు. శ్రీనివాసరావుది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం. కాగా, ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఘటనకు పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయించింది. ప్రాణాలు కోల్పోయిన అటవీ శాఖ రేంజ్ అధికారి శ్రీనివాసరావు కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచింది. ఇంటి స్థలం, ఆర్థిక సహాయంతో పాటు డిప్యూటీ తహసీల్దార్‌గా శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. దీంతో పాటు ప్రభుత్వం రూ.50,00,000 ఆర్థిక సాయం కూడా అందజేసింది. అటవీ శాఖ అధికారుల భద్రత కోసం ఆయుధ సంపత్తిని పెంచడంతో పాటు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News