- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరల పెరుగుతలకు బ్రేక్ పడటం లేదు. మరోసారి లీటర్ పెట్రోల్, డీజిల్పై 35 పైసల చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.108.25, డీజిల్ ధర రూ.97.02కు చేరింది. ముంబైలో పెట్రోల్ రూ.114.14, డీజిల్ రూ.105.12కు పెరిగింది. ఇక, హైదరాబాద్లో లీటరు పెట్రోల్పై 36 పైసలు, డీజిల్పై 38 పైసలు పెరిగాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.112.63, డీజిల్ ధర రూ.105.84కు పెరిగాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.114.40, డీజిల్ రూ.106.99కు చేరుకుంది.
Fuel Prices hiked in India
- Advertisement -