Monday, April 29, 2024

నడ్డాను ట్యాగ్ చేస్తూ గౌతమ్ గంభీర్ ట్వీట్.. రాజకీయాలకు గుడ్ బై

- Advertisement -
- Advertisement -

భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను ట్యాగ్ చేస్తూ గౌతమ్ గంబీర్ ట్వీట్ చేశాడు. రాజకీయ బాధ్యతల నుంచి తప్పించాలని జెపి నడ్డాకు గంబీర్ ట్వీట్ చేశారు. క్రికెట్ పై దృష్టి సారించేందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నాని గంభీర్ పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన మోడీ, అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. గంభీర్ తూర్పు ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించారు. రాజకీయాల్లోకి రాకముందు ఉత్సాహంగా ఆడే క్రీడపై తన దృష్టిని మళ్లించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ, తన క్రికెట్ కట్టుబాట్లపై దృష్టి పెట్టాలనే కోరికను వ్యక్తం చేశాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News