కోల్కతా: ఫోన్ పగలగొట్టినందుకు తల్లి తిట్టిందని ఓ కూతురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోల్కతాలోని రిజెంట్ పార్క్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అమ్మాయి తన తల్లితో కలిసి మార్కెట్ కు వెళ్లింది. మార్కెట్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు తల్లి ఫోన్ను ఆమె జారవిడిచింది. ఫోన్ పగిలిపోవడంతో కూతురుని తల్లి తిట్టడమే కాకుండా ఫోన్ పై పెట్టిన శ్రద్ధ చదువుపై పెట్టాలని చీవాట్లు పెట్టింది. అంతే కాకుండా ఇంటికి వచ్చిన తరువాత తండ్రితో తిట్టించింది. బెడ్రూమ్లోకి వెళ్లిన ఆ కూతురు గడియపెట్టుకొని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎంతకు తలుపు తీయకపోవడంతో డోర్ను బద్దలుకొట్టిచూడగా కూతురు ఉరేసుకొని కనిపించింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.