Thursday, March 28, 2024

గోదావరి నీళ్లను మోగుడంపల్లికి తీసుకొచ్చాం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Godavari waters send to Mogudampalli

సంగారెడ్డి: కాంగ్రెస్ పాలనలో గీతారెడ్డి రెండు సార్లు గెలిచినా, మంత్రిగా ఉన్నా జహీరాబాద్ లో అభివృద్ధి మాత్రం చేయలేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. మాటలకే పరిమితం అయ్యారే తప్ప పనులు చేయలేదని మండిపడ్డారు. నగర బాట లో భాగంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులలో సైకిల్ పై ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు.  క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ స్థానికులు, మహిళలను కలుస్తూ సమస్యలు అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే మాణిక్ రావు, పార్టీ జిల్లా అధ్యక్షులు చింత ప్రభాకర్, టిఎస్ఎంఎస్ఐడిసి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పార్టీ నాయకులు, జిల్లా, మున్సిపల్ అధికారులు ఉన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో సైకిల్ యాత్ర చేసి ఇంటింటికి వెళ్లి సమస్యలు గుర్తించామన్నారు.  ఇక్కడి ఎమ్మెల్యే మాణిక్యరావు కోరిక మేరకు
ముఖ్యమంత్రి కెసిఆర్ రు. 50 కోట్లు జహీరాబాద్ పట్టణ అభివృద్ధి కోసం మంజూరు చేశారని, గతంలో కూడా జహీరాబాద్ పట్టణం కోసం 25 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. వీటితో పాటు ఫోర్ లైన్ రోడ్ లు, బటర్ ఫ్లై లైట్లు ఏర్పాటు చేసుకోవడంతో పాటు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు.

ఈరోజు జరిగిన సైకిల్ యాత్రతో ఏ ఏ వార్డుల్లో ఏ సమస్యలు ఉన్నాయి అని అధికారులతో కలిసి గుర్తించామని, అవసరం అయిన చోట నాలాలు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోబోతున్నామని హరీష్ రావు వివరించారు.  జహీరాబాద్ ఒకప్పుడు నీళ్లు లేక ఇబ్బంది పడ్డ ప్రాంతం మిషన్ భగీరథ వల్ల ఆ సమస్యకు పరిష్కారం దొరికిందని,  19 కోట్లతో పట్టణాల్లో కొత్త పైప్ లైన్ పనులు పూర్తి దశకు వచ్చాయని, జహీరాబాద్ పట్టణ ప్రజలకు తాగునీరు పూర్తిగా అందించడం జరుగుతుందన్నారు.  రైల్వే బ్రిడ్జి పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించామని, రాబోయే రోజుల్లో జిల్లాలోని అన్ని మున్సిపాలిటిల్లో సైకిల్ యాత్ర చేస్తామని, సమస్యలు గుర్తించి పరిష్కారం చేస్తామన్నారు. రు. 3000 కోట్లతో సంగమేశ్వర ద్వారా గోదావరి నీళ్లను తెలంగాణలోని అత్యంత ఎత్తైన మోగుడంపల్లికి తీసుకవచ్చామని, కెసిఆర్ తోనే గోదావరి నీళ్ళు ఇక్కడికి వస్తున్నాయని, లక్ష ఎకరాలకు నీళ్ళు అందించ బోతున్నామన్నారు.

ఎన్ఐఎంజడ్ మొదటి ఫేస్ అనుమతి వచ్చిందని, డిఫెన్స్ ఫ్యాక్టరీ రాబోతుందని, మరిన్ని కంపెనీలు తీసుకురావడం జరుగుతుందన్నారు. మరోవైపు గోదావరి నీళ్ళు వస్తాయని, మొత్తంగా ఈ ప్రాంతం రూపురేఖలు మారబోతున్నాయన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు స్థానికులకే ఇక్కడి పరిశ్రమల్లో ఉద్యోగాలు దక్కనున్నాయని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News