Friday, May 10, 2024

ప్రభుత్వ స్టాఫ్ నర్సు పోస్టుల ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ స్టాఫ్‌నర్సు పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. 7,094 స్టాఫ్ నర్సు పోస్టులకు ఆగస్టులో నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను టిఎస్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు పొందిన పాయింట్లపై ఈ నెల 20వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను బోర్డు దృష్టికి తేవాలని సూచించారు. స్టాఫ్‌నర్స్ పోస్టులకు సుమారు 40 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News