Wednesday, April 30, 2025

ఆర్టీసి యూనియన్ నాయకులను చర్చలకు ఆహ్వానించిన గవర్నర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః ఆర్టీసి బిల్లుపై యూనియన్ నాయకులను గవర్నర్ తమిళిపై చర్చలకు ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఆర్టీసి బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసి ఉద్యోగులు రాజ్‌భవన్ ముట్టడికి భారీ ర్యాలీగా వచ్చారు.

అయితే, ప్రస్తుతం గవర్నర్ తమిళిసై పుదుచ్చేరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసి యూనియన్ నాయకులతో పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతానని గవర్నర్ తమిళిసై తెలిపారు. దీంతో 10 మంది యూనియన్ నాయకులు రాజ్‌భవన్ నుంచి గవర్నర్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడేందుకు అంగీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News