Saturday, July 27, 2024

జగన్ విదేశీ టూర్‌కు గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి సిఎం జగన్మోహన్‌రెడ్డి విదేశీ పర్యటన కోసం సిబిఐ కోర్టు అనుమతించింది. ఆయన ఈనెల 17 నుంచి జూన్ 1 వరకు యూకే వెళ్లేందుకు సి బిఐ కోర్టును ఇటీవలే అనుమతి కోరారు. కుటుంబంతో కలిసి జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. తాను తన ఫ్యామిలీతో కలిసి జెరూసలేం, లండన్, స్వి ట్జర్లాండ్ వెళ్లాల్సి ఉందని జగన్ తన పిటిషన్ లో కోర్టుకు వెల్లడించారు. అంతేకాక, లండన్‌లో తన కుమార్తెలు చదువుకుంటున్నారని, వారితో కొన్ని రోజులు  గడపడం కోసం కూడా అక్కడికి వెళుతున్నట్లు జగన్ చెప్పారు. అయితే జగన్ విదేశీ పర్యటన కోసం అనుమతి పిటిషన్‌పై సిబిఐ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. జగన్ అక్రమాస్తుల కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వవద్దని సిబిఐ కోర్టులో కౌంటర్ పిటిషన్ వేసింది. అయినా ఇరు వర్గాల వాదనలు విన్న సిబిఐ కోర్టు జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చిందిఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News