Friday, April 19, 2024

‘సుప్రీం’లో యెస్‌ బ్యాంక్‌కు ఊరట

- Advertisement -
- Advertisement -
భద్రద సోలార్‌ పిపిఏకు ఆమోదం

న్యూఢిల్లీ : ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ నుంచి స్వాధీనం చేసుకున్న భద్రద సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు విషయంలో ఎస్‌ బ్యాంకుకు పెద్ద ఊరట లభించింది. ఈ ప్రాజెక్టు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలన్న గుజరాత్‌ ఉర్జా వికాస్‌ నిగం లిమిటెడ్‌ (జియూవిఎన్‌ఎల్‌) అప్పీల్‌ను కోర్టు తోసిపుచ్చింది. దివాలా ప్రక్రియలో ఉన్న ఈ ప్రాజెక్టును, ఆ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చిన యెస్‌ బ్యాంకు స్వాధీనం చేసుకుని నడుపుతోంది. దివాలా ప్రక్రియకు చేరినందున ఈ ప్రాజెక్టు పిపిఏను రద్దు చేస్తున్నట్టు జియూవిఎన్‌ఎల్‌ గతంలో ప్రకటించింది. అయితే ఎన్‌సిఎల్‌టి, ఎన్‌సిఎల్‌ఏటి దీన్ని తోసిపుచ్చాయి. దీంతో జియూవిఎన్‌ఎల్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించిది. చివరికి అక్కడ కూడా ఆ కంపెనీకి చుక్కెదురైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News