Thursday, April 25, 2024

ఆ కేసులో బిజెపోళ్లు కోర్టుకు ఎందుకు వెళ్తున్నారు: తమ్మినేని

- Advertisement -
- Advertisement -

 

జనగాం న్యూస్: సిఎం కెసిఆర్ పట్ల బిజెపి కక్షపూరితంగా వ్యవహరిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. జనగాంలో తమ్మినేని మీడియాతో మాట్లాడారు. ఎంఎల్‌ఎ కొనుగోలు కేసులో బిజెపికి సంబంధం లేదంటూనే హైకోర్టు, సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో ఇడి, సిబిఐలతో దాడులు చేస్తే కాషాయ పార్టీపై ప్రజలు తిరగబడుతారని తమ్మినేని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News