Saturday, April 20, 2024

కడుపు నింపి.. కన్నీరు తుడిచి..

- Advertisement -
- Advertisement -

జన హృదయాలను గెలుచుకోవడంలో, జనంతో మమేకం కావడంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావుది విభిన్న శైలి. తన ఇంటికి వచ్చినా, క్యాంప్ ఆఫీసుకు వచ్చినా వారు సామాన్యులైనా.. అధికారులైనా.. నేతలైనా.. ఎవరైనా సరే.. ఖాళీ కడుపుతో వెళ్లకుండా ఇంటిని, క్యాంప్ ఆఫీసులను హరీశ్‌రావు నిత్యాన్నసత్రంగా మార్చారు. అటు సిద్దిపేట, ఇటు కోకాపేటలో హరీశ్‌రావు వస్తున్నారంటే జనంతో పరిసరాలు కిక్కిరిసిపోతాయి.

రకరకాల పనుల కోసం వచ్చే వారందరినీ కలవడమే గాక వారి ఆకలిని తీర్చడానికి హరీశ్ రావు ప్రత్యేక కిచెన్లను ఏర్పాటు చేసి, వంటవారిని నియమించారు. హరీశ్‌రావు హైదరాబాద్‌లో ఉన్నా.. సిద్దిపేటలో ఉన్నా అక్కడ ఉదయం 8 నుంచి సాయంత్రం 3 గంటల వరకు మజ్జిగ, పప్పు, సాంబారుతో వేడివేడి భోజనాలు వడ్డిస్తారు. అందుకే.. హరీశ్ డిఫరెంట్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News