Tuesday, April 30, 2024

మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికే రైతు దీక్షలు చేస్తున్నాం: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ రైతు దీక్షలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి రైతు దీక్షలు చేస్తున్నామన్నారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయారు. వారి కుటుంబాలను ఏ మంత్రీ పరామర్శించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండిన పంటపొలాలను చూడడానికి రావడం లేదన్నారు. కరెంటు లేదు, నీళ్లు లేవు. కన్నీళ్లే మిగిలాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల పరిహారం, చనిపోయిన రైతుల కుటుంబాలకు 20 లక్షలు పరిహారం చెల్లించాలి డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు, చిల్లర మాటలు మాని, రైతులను కాపాడాలని సూచించారు. మమ్మల్ని తిట్టండి కానీ రైతులను ఆదుకోండన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండన్న హరీశ్ రావు 2 లక్షల రైతు రుణమాఫీ, రైతుబంధు 15 వేలు, వడ్లకు మక్కలకు 500 బోనస్, రైతు కూలీలకు 12 వేలు, కౌలు రైతుల 15 వేలు ఇస్తామని చెప్పిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని ఫైర్ అయ్యారు. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్న బీజేపీ కూడా మాట తప్పిందని గుర్తుచేశారు.

కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే. కేసీఆర్ రైతులు దగ్గరికి వస్తున్నాడు కాబట్టి బీజేపీకి రైతులు ఇప్పుడు గుర్తొస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతులను ఆదుకోవాలి. వడ్ల కొనబోమని చెప్పింది బీజేపీ కాదా? అని ప్రశ్నించార హరీశ్ రావు. కాంగ్రెస్‌కు అధికారంలోకి వచ్చాక కళ్లు నెత్తుకెక్కాయి. రైతుబంధు పడలేదంటే చెప్పుతో కొట్టమన్నడు కోమటిరెడ్డి… మీతో చెప్పుతో కొట్టించుకోవడానికి మిమ్మల్ని గెలిపించింది? అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో పంటలు పండడం తప్ప ఎండడు లేదు.. కాంగ్రెస్ వచ్చింది, కరువొచ్చింది అని ఎద్దేవా చేశారు.

పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మాట తప్పిన మీకు మళ్లీ మేనిఫెస్టో పెట్టే నైతిక అర్హత లేదన్నారు. రైతులకు మేలు చేసే దాకా బీఆర్ఎస్ పోరాడుతుందన్న ఆయన రైతులు ధైర్యంగా ఉండాలి.. ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు. మీకు అండగా మేముంటామని భరోసా కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News