Sunday, April 28, 2024

కూతురు గొంతుకోసి చంపిన ప్రొఫెసర్

- Advertisement -
- Advertisement -

హర్యానాలో ఓ ప్రొఫెసర్ తన కన్నకూతురిని అత్యంత దారుణంగా గొంతుకోసి చంపివేశాడు. తరువాత తన ప్రాణాలు తీసుకున్నాడు. ఆదివారం సాయంత్రం ప్రొఫెసర్ సందీప్ గోయల్ తన ఎనిమిదేళ్ల కూతురిని తీసుకుని స్కూటర్‌పై బయటకు వెళ్లి వస్తామని భార్యకు చెప్పి వెళ్లాడు. తరువాత ఎంతకూ తిరిగిరాలేదు. భార్య ఇతరులు వెళ్లి చూడగా సమీపంలో ఆయన పనిచేసే వర్శిటీలో ఆయన కార్యాలయంలో ఎనిమిదేళ్ల కూతురు రక్తపు మడుగులో పడి ఉంది. పక్కనే ఆయన శవం కూడా ఉంది. అక్కడి కత్తితోనే ఆయన గొంతుకోసుకుని చనిపోయినట్లుగా నిర్థారణ అయింది. చాలా కాలంగా ఈ వ్యక్తి నిస్పృహతో చిరాకుగా ఉంటున్నాడని కారణాలు తెలియదని ఘటన తరువాత ఆయన సహోద్యోగులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News