Friday, March 29, 2024

రంగారెడ్డిలో భార్య గొంతునులిమి చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొత్తపల్లిలో దారుణం చోటుచేసుకుంది. భర్త శ్రీకాంత్ తన భార్య సరిత గొంతునులిమి హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం శ్రీకాంత్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గత ఏడు సంవత్సరాల క్రితం దంపతులకు పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యపై అనుమానంతో హత్య చేశారా? లేక ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో ఆవేశంలో చంపేశారా? అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News