Friday, April 26, 2024

భార్య చూస్తుండగానే భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. భార్య చూస్తుండగా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భవనం పైనుంచి దూకి రేవన్ సిద్దప్ప బలవన్మరణం పొందాడు. ఈ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీరం చెరువులో జరిగింది. భార్యతో గొడవ పడి రేవన్ భవనం పైనుంచి దూకాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రేవన్ సిద్ధప్ప దుర్మరణం చెందాడు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తరువాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News