Saturday, April 20, 2024

అశ్విన్ అతిగా ప్రయోగాలు చేయకు: రవిశాస్త్రి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో స్పిన్ బౌలర్ అశ్విన్ అతిగా ప్రయోగాలు చేయవద్దని మాజీ క్రికెటర్ అశ్విన్ సూచించారు. రవి శాస్త్ర కోచ్‌గా ఉన్నప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై రెండు సిరీస్‌లను భారత జట్టు కైవసం చేసుకుంది. భారత జట్టులో అతి ముఖ్యమైన ఆటగాడు అశ్విన్ అని, తనదైన రోజు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో విజృంభిస్తాడు. అతడు విజృంభిస్తే సిరీస్ భారత్ వశం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అందులో భారత గడ్డపై అశ్విన్ అత్యంత ప్రమాదకారి అని తెలిపాడు. అతడు ఎప్పటిలాగే బౌలింగ్ చేసే సరిపోతుందని రవి శాస్త్రి సలహా ఇచ్చాడు. రవీంద్ర జడేజా, అక్షర పటేల్ ఒకే రకమైన బౌలింగ్ చేస్తారని, కులదీప్ యాదవ్ తీసుకుంటే తొలి రోజు నుంచి స్పిన్ తిప్పగలడన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News