Monday, April 29, 2024

హైదరాబాద్ మెట్రోకు రూ. 10 వేలు జరిమానా

- Advertisement -
- Advertisement -

ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు
ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పు

మనతెలంగాణ/హైదరాబాద్: ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్ హైదరాబాద్ మెట్రోకు రూ.10 వేలు జరిమానా విధించింది. మెట్రో స్టేషన్‌లో రూ. 10లు అదనంగా వసూలు చేశారన్న ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిషన్ ఈ మేరకు జరిమానా విధించింది. మెట్రో రైల్వే స్టేషన్‌లో ఒకవైపు నుంచి మరో వైపుకు ప్రయాణించేటప్పుడు ప్రయాణికుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.10లను వాపసు ఇవ్వాలని మెట్రో సంస్థను ఆదేశించింది. ఖమ్మం జిల్లాకు చెందిన న్యాయవాది వెల్లంపల్లి నరేంద్ర స్వరూప్ 2019 జనవరి 18న మెట్రోలో ప్రయాణించేందుకు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్‌కు వెళ్లగా, మెట్రో రైలుకు తూర్పు వైపు టాయిలెట్లు లేకపోవడంతో మరో వైపు టాయిలెట్లోకి వెళ్లాడు. అందుకు మెట్రో రైల్వే జారీ చేసిన ట్రావెల్ కార్డును స్టేషన్‌లో స్వైప్ చేశాడు. అయితే అదే స్టేషన్లో ఒక పైపు నుంచి మరో వైపు వెళ్లేందుకు ట్రావెల్ కార్డు నుంచి రూ.10లు కట్ అయ్యాయి. ప్రయాణం చేయకుండా డబ్బులు ఎలా కట్ చేస్తారని బాధితుడు మెట్రో అధికారులను ప్రశ్నించారు. దానికి మెట్రో సిబ్బంది సరైన సమాధానం చెప్పలేదు.

దీనిపై ఖమ్మంలోని వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇరువైపులా మరుగుదొడ్లు ఏర్పాటు లేకపోవడంతో తన వద్ద రూ.10లు అదనంగా వసూలు చేసి, మెట్రో సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై ఖమ్మం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్ లలిత, సభ్యురాలు ఎ.మాధవీలత విచారణ చేపట్టారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి రూ. 5 వేలు, కోర్టు ఖర్చు మరో రూ.5 వేలు 45 రోజుల్లోగా కట్టాలని వినియోగదారుల కమిషన్.. మెట్రో సంస్థను ఆదేశించింది. ప్రయాణికుల సౌకర్యార్థం డిస్ ప్లే బోర్డులు పెట్టాలని వినియోగదారుల కమిషన్ మెట్రోను ఆదేశించింది.

consumer forum

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News