Thursday, April 25, 2024

రుణ రేట్లను సవరించిన ఐసిఐసిఐ, పిఎన్‌బి, బిఒఐ

- Advertisement -
- Advertisement -

ముంబై : ఈ నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్య విధాన కమిటీ సమావేశానికి ముందే బ్యాంకు రుణ రేట్లను సవరించాయి. ఐసిఐసిఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి), బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలు జూన్ 1 నుండి మరింత ప్రియం కానున్నాయి. అయితే పిఎన్‌బి కొన్ని టర్మ్ లోన్‌లను చౌకగా చేసింది.

గతేడాది మే నుంచి ఆర్‌బిఐ వడ్డీ రేట్లను దాదాపు 2.5 శాతం పెంచింది. వచ్చే వారం నుంచి ఆర్‌బిఐ సమావేశం జరగనుండగా, ఈ భేటీలో రెపో రేటుపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఏప్రిల్ సమావేశంలో సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును యథాతథంగా కొనసాగించింది.

ఐసిఐసిఐ బ్యాంక్:
ఇది 6 నెలల రుణ రేటును 8.75 శాతానికి పెంచింది. అయితే ఒక సంవత్సరం రుణ రేటు 8.85 శాతంగా ఉంటుంది.

పిఎన్‌బి:
పిఎన్‌బి అన్ని టర్మ్ లోన్‌ల రేటును 0.10 శాతం పెంచింది. దీని ఒక సంవత్సరం రేటు 8.60 శాతం, మూడు సంవత్సరాల రుణ రేటు 8.90 శాతం ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా:
ఈ బ్యాంక్ అన్ని టర్మ్ లోన్‌ల రేటును 0.05 శాతం పెంచింది. ఒక సంవత్సరం రేటు ఇప్పుడు 8.65 శాతం, 6 నెలల రేటు 8.45 శాతం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News