Saturday, April 27, 2024

విశాఖలో భారత్-ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ కు వర్షం ముప్పు?

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: ఇటీవల ముగిసన వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన టీమిండియా ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది. గురువారం నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్ ల టి20 సిరీస్ జరుగనుంది. ఈరోజు విశాఖపట్నం వేదికగా జరుగనున్న తొలి టి20 మ్యాచ్ లో ఆసీస్ తో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని యువ భారత్ తలపడుతోంది. అయితే, ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. సాయంత్రం విశాఖలో చిరు జల్లులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

కాగా, ఈ రోజు సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ సందర్భంగా విశాఖకు చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు సింహాచలం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. క్రికెటర్లను వేదపండితులు, ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

జట్లు వివరాలు:
భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్‌సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముకేశ్ కుమార్, జితేష్ కుమార్, అవేశ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్.

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, స్టోయినిస్, మాథ్యూవేడ్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రాన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా, రిచర్డ్‌సన్, అరోన్ హార్ది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News