Friday, April 19, 2024

రెండో వన్డే: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

- Advertisement -
- Advertisement -

రాంచీ: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచింది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో సఫారి కెప్టెన్ బావుమా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే తొలి వన్డేలో గెలుపొందిన దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ లోనూ గెలుపొంది సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు, భారత్ ఈ మ్యాచ్ లో గెలిచి సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. కాగా, గాయం కారణంగా ఈ సిరీస్ కు భారత బౌలర్ దీపక్ చాహర్ దూరమైన విషయం తెలిసిందే. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకున్నారు.

IND vs SA 2nd ODI: SA Win toss and opt bat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News