Monday, May 13, 2024

భారత బౌలర్ల విజృంభన..79 పరుగులకే 7వికెట్లు డౌన్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: నరేంద్రమోదీ స్టేడియలో టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో విండీస్‌ వరుసగా వికెట్లు కోల్పోతోంది. భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ విండీస్ కు షాకిచ్చాడు. ఒకే ఓవర్లో వరుస బంతుల్లో బ్రాండన్ కింగ్ (13), డారెన్ బ్రావో (18)లను ఔట్ చేసి విండీస్ ను దెబ్బ కొట్టాడు. తన తర్వాతి ఓవర్ లోనూ బ్రూక్స్(12)ను పెవిలియన్ పంపించాడు. చాహల్ తోపాటు వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు తలో ఒక వికెట్ తీయడంతో విండీస్ 79 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పస్తుతం విండీస్ జట్టు 23 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. క్రీజులో హోల్డర్(5), ఎలెన్(0)లు ఉన్నారు.

IND vs WI 1st ODI: West Indies lost 7th wicket

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News