Thursday, April 25, 2024

నల్లధనం కుంభకోణాల భారత్!

- Advertisement -
- Advertisement -

2014 ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమి అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలనతో పాటు, వంద రోజుల్లో విదేశాల్లో మూలుగుతున్న నల్లడబ్బు దేశానికి రప్పించి ప్రతి వ్యక్తికి రూ. 15 లక్షల ఇస్తానని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లధనాన్ని వెలికి తీసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని మోడీ ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ఈ బృందం ఏమి చేస్తున్నదీ, ఏమి చేసింది మోడీకి మాత్రమే తెలుసు. దర్యాప్తు బృందం గురించి, నల్లడబ్బు గురించి నేడు మోడీ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నది? నల్లధనం యథేచ్ఛగా విదేశాలకు తరలి పోతున్నా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? పాలకుల విధానాల ఫలితంగా ఆసియాలోనే అత్యంత అవినీతి దేశంగా భారత్ నిలిచింది. 69% అవినీతితో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత 65%తో వియత్నాం ఉంది.

పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక, రాజకీయ విధానాలు ఏ వర్గాల ప్రయోజనాలు కాపాడుతున్నాయన్నదానిపై ఆ దేశ ఆర్థిక విధానాలతో పాటు, సంపద కేంద్రీకరణ, వికేంద్రీకరణ, అవనీతి, నల్లధనం వెల్లడవుతుంది. అధికారం మార్పిడి జరిగిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలన్నీ భూస్వాముల, బడా పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదుల ప్రయోజనాలు కాపాడే విధానాలు అమలు జరుపుతూ వస్తున్నాయి. దాని ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ అవినీతికి, భారీ కుంభకోణాలకు నిలయంగా మారింది. దీని ఫలితంగా ఒక వైపు సంపద పోగుపడటం, మరోపక్క దారిద్య్రం సమానాంతరంగా కొనసాగుతున్నది. దేశంలో వంద మంది కుబేరులు ఉంటే, 23.6 బిలియన్ డాలర్లతో ముఖేశ్ అంబానీ మొదటి స్థానంలో ఉన్నాడు.

ఒక శాతం అతి ధనవంతులు 90%పైగా దేశ సంపద కలిగి ఉన్నారు. మిగిలిన వారందరూ 10% మాత్రమే కలిగి ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమి అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలనతో పాటు, వంద రోజుల్లో విదేశాల్లో మూలుగుతున్న నల్లడబ్బు దేశానికి రప్పించి ప్రతి వ్యక్తికి రూ. 15 లక్షల ఇస్తానని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నల్ల ధనాన్ని వెలికి తీసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని మోడీ ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ఈ బృందం ఏమి చేస్తున్నదీ, ఏమి చేసింది మోడీకి మాత్రమే తెలుసు. దర్యాప్తు బృందం గురించి, నల్లడబ్బు గురించి నేడు మోడీ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నది? నల్లధనం యథేచ్ఛగా విదేశాలకు తరలి పోతున్నా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?
పాలకుల విధానాల ఫలితంగా ఆసియాలోనే అత్యంత అవినీతి దేశంగా భారత్ నిలిచింది. 69% అవినీతితో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత 65%తో వియత్నాం ఉంది. భారత దేశంలో ప్రతి పది మందిలో ఏడుగురు ఏదో ఒక సందర్భంలో అవినీతికి పాల్పడ్డారని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న పౌర సమాజ సంస్థ ట్రాన్స్‌పెరెన్సీ ఇంటర్నేషనల్ నిర్వహించిన తాజా సర్వేల్లో వెలుగు చూశాయి. నల్లధనం జాతీయ ఉత్పత్తిలో (జిడిపి) 18% నుంచి 20% వరకు ఉంది.

ప్రతి రోజూ రూ. 240 కోట్లు దేశ సరిహద్దులు దాటిపోతున్నాయి. 1948 నుంచి 2008 వరకు 46,200 కోట్ల డాలర్ల సొమ్ము విదేశాలకు తరలిపోయింది. స్విస్ బ్యాంక్ లో 80 లక్షల కోట్ల భారత దేశ డబ్బులు మూలుగుతున్నాయి. దేశంలో నల్లడబ్బు కథ ఇప్పటిది కాదు. జాతీయోద్యమ కాలంలోనే నల్లడబ్బు పోగబడటం ప్రారంభమైంది. 1955లో నికోలస్ కల్టోర్ జరిపిన పరిశోధనలో రూ. 600 కోట్ల నల్లధనం ఉన్నట్లు తేలింది. ఇది ఆనాటి దేశ స్థూల ఉత్పత్తిలో 4.5% గా ఉంది. 1969లో జస్టిస్ వాంచూ కమిటీ పన్నుల విధానంపై సూచనలు చేస్తూ పోగుబడిన నల్లధనం రూ. 7 వేల కోట్లని చెప్పింది. 1980- 81 లో రాజచల్లయ్య నేతృత్వంలోని పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ప్రకారం పోగైన నల్లధనం రూ. 15 లక్షల కోట్లు. ఇది జిడిపి 20% గా చెప్పింది. 1992లో ఎస్‌బి గుప్తా పరిశీలన ప్రకారం అది 42%. 1987-88లో జిడిపిలో నల్లధనం 51% ఉంది. జవహర్ లాల్ విశ్వవిద్యాలయం ఆర్థికశాఖ ప్రొఫెసర్ అరుణకుమార్ 2005-06లో రాసిన బ్లాక్ ఎకానమి ఇన్ ఇండియా అనే పుస్తకంలో జిడిపిలో 50% ఉన్న నల్లధనం విలువ రూ. 39 లక్షల కోట్లగా చెప్పింది.

ఒక్క 2012 సంవత్సరంలోనే 95 బిలియన్ డాలర్లు (6 లక్షల కోట్లు) దేశం నుంచి దాటించబడింది. 2022 సంవత్సరం నాటికి రూ. 89 లక్షల కోట్లుగా నల్ల ధనం అంచనాగా ఉంది. మోడీ లాగనే, నెహ్రూ కూడా బినామీ పేర్లతో విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని తీసుకొస్తానని ప్రకటించి, స్వచ్ఛందంగా నల్లధనాన్ని ప్రకటించిన వారికి రాయితీలు ప్రకటించాడు. ఈ ప్రకటన తర్వాత 1961లో గుర్తించిన 20,912 కేసులకు గాను ప్రకటించిన డబ్బు 10 కోట్ల 90 లక్షలు మాత్రమే. నెహ్రూ ప్రవేశపెట్టిన ఈ పథకానికి 1975లో చట్టబద్ధత కల్పించారు. అయినా ప్రభుత్వానికి ఆదాయపు పన్ను ద్వారా రూ. 248 కోట్లు, సంపద పన్ను ద్వారా రూ. 7 కోట్ల 7 లక్షలు మాత్రమే వచ్చింది. దీన్ని గమనిస్తే నల్లడబ్బుల బడా కుబేరులెవ్వరూ డబ్బును బయటకు తీయలేదని వెల్లడవుతున్నది. నల్లధనం వెలికితీతకు మోడీ ప్రభు త్వం కనీసం ఇలాంటి చర్యలకు కూడా సాహచించలేదు. నల్ల డబ్బును దేశంలోకి రప్పిస్తానని చెప్పటం కేవలం ఎన్నికల లబ్ధి కోసమే అన్నది వెల్లడైంది.

నల్లడబ్బుకి, కుంభకోణాలకు అవినాభావ సంబంధం ఉంది. నల్ల డబ్బు అవినీతి కుంభకోణాలు మూలం. దేశంలో జరిగిన కుంభకోణాలన్నీ లెక్కించటం చాలా కష్టం. వెలుగు చూసిన కొన్ని ప్రధాన కుంభకోణాలను గమనిద్దాం. నెహ్రూ కాలంలో దమానియా, ముద్రా కుంభకోణాలు బయటపడ్డాయి. వీటిలో చిక్కుకున్న అప్పటి ఆర్థిక మంత్రి టి.టి. కృష్ణమాచారి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 1986లో భోపోర్స్ ఆయుధాల కుంభకోణం దేశాన్ని కుదిపి వేసింది. పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఫ్రాన్స్ నుంచి 1990లో ఎయిర్ బస్ ఎ 320 కొనుగోలు ఒప్పందానికి సంబంధించి 2,500 కోట్ల కిక్ బ్యాంక్ కుంభకోణం జరిగింది. 1993లో 3 వేల కోట్ల హర్షాద్ మెహతా సెక్యూరిటీ స్కామ్, 1992లో ప్రధాన మంత్రి పదవి కాపాడుకునేందుకు కోటి రూపాయల లంచంతో పి.వి.నరసింహరావు సూట్ కేస్ కుంభకోణం, 2011లో జరిగిన హవాలా కుంభకోణం దేశంలో సంచలనంగా మారింది. దీన్ని జైన్ డైరీస్ కేసు అని కూడా అంటా రు. రాజకీయ నాయకులు, నలుగురు హవాలా బ్రోకర్లు జైన్ సోదరుల ద్వారా నడిపిన కుంభకోణం. ఇది 18 మిలియన్ డాలర్లగా ఉంది. ఇందులో ఎల్‌కె అద్వానీ, విసి శుక్లా, దేవీలాల్, శరద్ యాదవ్ లాంటి బడా నాయకులు ఉన్నారు. కోర్టు విచారణలో సాక్ష్యాలు తారుమారుతో వీరు కేసు నుండి బయటపడ్డారు.

యూరియా కుంభకోణం: ఇది 1996లో నమోదై 1997లో రిజస్టర్ చేయబడింది. నిందితులు ఉద్దేశ నేరపూరిత కుట్రకు పాల్పడి నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్‌ను రూ. 133 కోట్ల మేర మోసం చేశారన్న అభియోగం ముద్దాయిలపై మోపబడింది. భారత దేశానికి రెండు లక్షల టన్నుల యూరియా సరఫరాకు సంబంధించి ప్లె-బై- నైట్ టర్కీ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం. ఒప్పందం జరిగే నాటికే టర్కీ నుంచి ఈ కంపెనీ వెళ్ళిపోయింది. యూరియా ఒప్పంద మోసంలో పివి నరసంహరావు కుమారుడు కూడా కీలక పాత్ర నిందితుడు. 1997లో రిజిస్టర్ చేయబడిన ఈ కేసు 22 సంవత్సరాల తర్వాత విచారణ పూర్తి చేసి 13- జులై -2018 తీర్పు చెప్పి శిక్షలు విధించింది.

2జి స్పెక్ట్రమ్ కుంభకోణం: ఇది టెలికం కుంభకోణం. భారత టెలికంకి చెందిన 2జి స్పెక్ట్రమ్ లైసెన్సులను అతి తక్కువ ధరకు విక్రయించినట్లు అప్పటి టెలికం మంత్రి ఎ. రాజా, కనిమొళి తదితరులపై ఆరోపణ జరిగింది. దీని వల్ల ప్రభుత్వానికి రూ. 1,76, 000 కోట్ల ఆదాయం నష్టం జరిగింది. సిబిఐ, ఇడి 4- జులై -1997న కేసులు నమోదు చేశాయి. 17- డిసెంబర్ -2017న కేసుని నీరుగార్చటంతో ఢిల్లీ హైకోర్టు రాజా, కనిమొళి మిగతా అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో సిబిఐ, ఇడి అప్పీల్ చేశాయి. పై కుంభకోణాలే కాక ఇంకా అనేక కుంభకోణాలు జరిగాయి. సత్యం కంప్యూటర్ల ఆడిటింగ్ కుంభకోణం, నాఫెడ్ కుంభకోణం, లలిత్ మోడీ ఐపిఎల్ కుంభకోణం, కేరళ పామాయిల్ కుంభకోణం, జార్ఘండ్ మధుకోడా అక్రమాస్తుల కుంభకోణం, నితిన్ గడ్కరీ అవినీతి అందులో కొన్ని.

బ్యాంకు కుంభకోణాలు: వివిధ రంగాలతో పాటు బ్యాంకింగ్ రంగంలో కూడా అనేక కుంభకోణాలు జరిగాయి. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా 2005లో బ్యాంకుల నుంచి రూ. 9 వేల కోట్ల రుణం పొందాడు. నష్టాల పేరుతో బ్యాంకుల రుణాలు తీర్చకుండా విదేశాలకు పారిపోయాడు. మోడీ ప్రభుత్వం అందుకు సహకరించింది. అతన్ని దేశానికి ఇప్పటికీ మోడీ ప్రభుత్వం రప్పించి డబ్బుల రాబట్టలేకపోయింది. 2020లో నీరవ్ మోడీ ప్రభుత్వ బ్యాంకు, పంజాబ్ నేషనల్‌లో రూ. 11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడు. బ్యాంకు అధికారుల, రాజకీయ నాయకుల అండతోనే ఈ మోసం జరిగింది. 2022 సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో జరిగిన మోసా లు, ఎగ్గొట్టిన డబ్బుల లెక్కలపై ఆర్‌బిఐ రిపోర్టు తయారు చేసింది.

2020 -21 ఆర్థిక సంవత్సరంలో రూ. 81,922 కోట్లు, 2021- 22లో రూ. 40,295 కోట్లు మోసాలు జరిగినట్లు పేర్కొంది. భారత సామాజిక వ్యవస్థ వర్గ వైరుధ్యాలతో నిండినది. ఈ వ్యవస్థలో వ్యక్తిగత ఆస్తి పెంపు కోసం పాకులాట ఎక్కువ. అందుకు ఎలాంటి పనులకైనా కొందరు వెనుకాడరు. భారత పాలక పార్టీలలో ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. వీరు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి డబ్బు పోగుచేసుకోవటమే లక్ష్యంగా పెట్టుకుని ఎలాంటి నీచానికైనా దిగజారతారు. ఫలితంగా దేశంలో అవినీతితో పాటు, అనేక కుంభకోణాలు జరుగుతూనే ఉన్నాయి. దోపిడీ వర్గాలకు ప్రాతినిధ్య వహించే ప్రభుత్వాలు ఉన్నంత కాలం ఇవి జరుగుతూనే ఉంటాయి. ప్రజల సొమ్ము దోపిడీ వర్గాల పరమవుతూనే ఉంటుంది. దోపిడీ వ్యవస్థను తొలగించి నూతన ప్రజాతంత్ర వ్యవస్థ ఏర్పాటు మాత్రమే నల్లడబ్బును, కుంభకోణాలను నియంత్రించ గలుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News