Saturday, July 27, 2024

18 మంది పాక్ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లో నివాసం ఉంటున్న పాకిస్థాన్‌కు చెందిన 18 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం లభించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపునకు హాజరైన గుజరాత్ హోంశాఖ సహాయ మంత్రి హర్ సంఘవి వారికి పౌరసత్వం ప్రదానం చేశారు.

2016, 2018 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ మైనారిటీలకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేయడానికి గుజరాత్ లోని అహ్మదాబాద్, గాంధీనగర్, కచ్ జిల్లా కలెక్టర్లకు అధికారం ఉందని ప్రకటన తెలిపింది. ఇప్పటివరకు 1167 మందికి పౌరసత్వం ఇచ్చినట్టు పేర్కొంది. నూతన భారత్ కల సాకారానికి అందరితో కలిసి పనిచేయాలని తాజాగా పౌరసత్వం పొందిన వారికి మంత్రి పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News