Friday, July 11, 2025

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్

- Advertisement -
- Advertisement -

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. హైదరాబాద్ నుంచి కోల్‌కత్తా వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో కుడివైపు ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ తెలిపారు. సాంకేతిక లోపాన్ని పసిగట్టిన పైలట్ విమానాన్ని తిరిగి అత్యవసర లాండింగ్ చేశాడు. ఇంజన్‌లో సాంకేతిక లోపం గుర్తించి విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో 160 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News