Friday, March 29, 2024

ఇండోనేషియాలో ఘోర అగ్ని ప్రమాదం: 18 మంది మృతి

- Advertisement -
- Advertisement -

 

జకర్తా: ఇండోనేషియాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది సజీవదహనం కాగా 50 మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు. జకర్తాలోని పార్టీమీనాలో ఇంధన నిల్వ డిపోలో నుంచి మంటలు రావడంతో చుట్టు పక్కల ఇండ్లకు కూడా మంటలు వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక యంత్రాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక ప్రజలను ఇండ్ల నుంచి బయటకు పంపించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News