Wednesday, April 24, 2024

బావి కూలిపోయిన దుర్ఘటనలో 8 మంది భక్తులు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం శ్రీరామనవమి వేదుకల సందర్భంగా ఒక ఆలయంలోని బావి కూలిపోవడంతో 8 మంది మరణించగా పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో 8 మంది భక్తులు మరణించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఇళయరాజా ధ్రువీకరించారు. మెట్ల బావిలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సహాయక చర్యలు జోరుగా సాగుతున్నాయి. బావిపైన పైకప్పు కూలిపోవడంతో దానిపైన నిలుచుని ఉన్న పలువురు భక్తులు బావిలో పడిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News