విశాఖపట్నం: యోగా మనల్ని నడిపిండంతో పాటు మనల్ని మేల్కొలుపుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విశాఖపట్నంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడీకి ఎపి సిఎం చంద్రబాబు నాయుడు జాపికను బహుకరించారు. యోగా చేసిన అనంతరం మోడీ ప్రసంగించారు. విశాఖపట్టణంలో యోగాంధ్ర ఈవెంట్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎపి సర్కారుకు మోడీ అభినందనలు తెలియజేశారు. ప్రజల భాగస్వామ్యానికి ఇదొక స్ఫూర్తిగా నిలిచిందని, వికసిత్ భారత్ ఆలోచనలకు ఇది రూపమన్నారు.
యోగా వ్యక్తిగత క్రమశిక్షణకు మారుపేరని, ప్రపంచ గమనాన్ని మార్చిందని, వన్ఎర్త్.. ఎన్ హెల్త్ థీమ్తో ఈసారి యోగా దినోత్సవాన్ని నిర్వహించామని తెలియజేశారు. యోగా ప్రక్రియతో చికిత్స చేసే విధానాన్ని ఢిల్లీ ఎయిమ్స్ అభివృద్ధి చేస్తోందని, యోగాను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రచారం ఎక్కువల కల్పించాలని పిలుపునిచ్చారు. యోగా గురించి మన్ కీ బాత్లో కూడా విస్త్రృతంగా చర్చించామని, రోజూ మనం తినే ఆహారంలో 10 శాతం నూనె తగ్గించాలని, సంతులిత జీవన శైలిని అలవాటు చేసుకోవాలని మోడీ సూచించారు.
యోగాకు సరిహద్దుల్లేవు, వయసుతో పనిలేదని, ప్రకృతి, ప్రగతి సంగమం అని పేర్కొన్నారు. యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందని, 175 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని ప్రశంసించారు. యోగా గ్లోబలైజ్ కావడం సామాన్యమైన విషయం కాదని, యోగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవన శైలిని మార్చిందని మోడీ కొనియాడారు. అంతరిక్షంలో కూడా యోగా చేసిన ఘనత మనదేని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి సిఎం చంద్రబాబుకు, డిప్యూటీ సిఎం పవన్కల్యాణ్కు, మంత్రి లోకేష్, ప్రజలు హాజరయ్యారు.