Sunday, May 5, 2024

IPL 2024: గుజరాత్ పై బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్..ఇరుజట్లకు కీలకం

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: ఐపిఎల్ 17వ సీజన్ లీగ్ దశలో మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఢీకొనబోతున్నాయి. ముల్లన్‌పూర్ లోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా మరికొద్దిసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకంగా మారింది.

ఏడు మ్యాచుల్లో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించిన పంజాబ్ కు.. ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఇలాంటి స్థితిలో ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాలనే లక్షంతో పంజాబ్ పోరుకు సిద్ధమైంది.

ఇక, గుజరాత్ ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో 89 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తేనే గుజరాత్ కు గెలుపు అవకాశాలు ఉంటాయి. అయితే పంజాబ్‌తో పోల్చితే గుజరాత్ కాస్త బలంగా ఉందనే చెప్పాలి. శుభ్‌మన్, సాయి సుదర్శన్, సాహా, మిల్లర్, తెవాటియా, షారుక్, రషీద్ ఖాన్ తదితరులతో జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో గుజరాత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News