Friday, April 26, 2024

వంద కోట్ల డొనేషన్లు అవాస్తవం

- Advertisement -
- Advertisement -

ఐటి అధికారుల తీరుపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం 
బోయినపల్లి ఠాణాలో ఫిర్యాదు 
ల్యాప్‌టాప్ లాక్కొని విధులకు ఆటంకం కలిగించారంటూ మల్లారెడ్డి కుటుంబసభ్యులపై ఐటి శాఖ
డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ ఫిర్యాదు
ఇరువురి ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు

మన తెలంగాణ/హైదరాబాద్: అటు ఐటి శాఖ, ఇటు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్‌లో పరస్పరం చేసుకున్న ఫిర్యాదులు చర్చనీయాంశమయ్యాయి. ‘తనపై కు ట్ర పూరితంగా ఐటి సోదాలు చేసింది. తనతో పాటు కుటుంబసభ్యులు, ఉద్యోగులు అందరినీ ఇబ్బంది పెట్టింది. తాను చాలా క్లియర్‌గా ఉన్నాను. కట్టిన పన్నులు, లావాదేవీలు అన్నీ ఆన్‌లైన్‌లో ఉంటాయి. రూ.100 కోట్లు అవకతవకలు అనేది అవాస్తవమ’ని ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి కొట్టి పారేశారు. తన ఇంటితో పాటు కుమారుల ఇళ్లలో జరిపిన సోదాల్లో కేవలం రూ.28 లక్షల మాత్రమే దొరికాయన్నారు. వాటికి కూడా లెక్క లు ఉన్నాని తెలిపారు. తామేదో దొంగల్లాగా, సిఆర్‌పిఎఫ్ జవాన్లు నిలువరించారన్నారు. వచ్చిన ఐటి శాఖ అధికారులకు పూర్తిగా సహకరించామన్నారు.

ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్న సొత్తుకు సంబంధించి తన వద్ద, చిన్న కుమారుడి వద్ద సంతకం తీసుకున్నారని, పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి ఆనారోగ్యంగా ఉండటంతో కళాశాలకు సెక్రటరీగా ఉన్న చిన్న కుమారుడి వద్ద సంతకం తీసుకోవాలని తరువాయి 12లో

IT Raids Completed in Malla Reddy’s house

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News