- Advertisement -
హైదరాబాద్: టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోన్న రష్మిక మందనకు ఐటి అధికారులు ఝలక్ ఇచ్చారు. తన ఇంటిపై ఐటి దాడులు జరుగుతున్నాయి. కర్నాటక రాష్ట్రానికి చెందిన రష్మిక సొంత గ్రామం కొడుగు జిల్లా విరాజ్ పేట్ ఐటి సోదాలు నిర్వహించింది. కాగా, ఈ ఐటి సోదాలు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు, అటు రష్మిక కూడా దీనిపై స్పందించలేదు. ఆమె హీరోయిన్గా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సిన్మా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. కాగా, ప్రస్తుతం రష్మిక తెలుగుతో పాటు కన్నడలో టాఫ్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఈ అందాల బామ తదుపరి చిత్రాలు అల్లు అర్జున్ సుకుమార్ సినిమాతో పాటు, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి టాప్ హీరోలతో కథానాయికగా నటించే చాన్స్ కొట్టేసింది.
IT Raids On Rashmika Mandanna House In Virajpet
- Advertisement -