జపాన్ లోని టోక్యోలో 2017లో తన అపార్ట్మెంట్ లోని 9 మందిని తకహిరో షిరైషి అనే వ్యక్తి కర్కశంగా హత్య చేసిన సంఘటన సంచలనం సృష్టించింది.న దాంతో నాటి నుంచి అతడు ట్విటర్ కిల్లర్గా వైరల్ అయ్యాడు. తాజాగా అతడికి మరణశిక్ష విధించినట్టు అధికారులు పేర్కొన్నారు. టోక్యో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం … టోక్యో లోని ఓ అపార్ట్మెంట్ లోని ఓ ఫ్లాట్ లో ఎనిమిది మంది మహిళలు , ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన 2017 లో చోటు చేసుకుంది. అనుమానం వచ్చిన పోలీసులు ఫ్లాట్కు చెందిన తకహిరో షిరైషి అనే వ్యక్తిని అదుపు లోకి తీసుకుని విచారించగా, ఈ హత్యలకు సంబంధించి భయానక విషయాలు వెలుగు లోకి వచ్చాయి.
తాను చంపిన 9 మంది సోషల్ మీడియాలో వారు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్టు వివిధ సందర్భాల్లో పోస్టులు పెట్టడాన్ని గమనించానని నిందితుడు తెలిపాడు.అనంతరం సోషల్ మీడియా ట్విటర్ ద్వారా తాను బాధితులను సంప్రదించి, వారు చనిపోవడానికి సహాయం చేశానని చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. వారు చనిపోవాలని అనుకున్నందుకే తాను ఎనిమిది మంది మహిళలు సహా ఓ వ్యక్తిని హతమార్చినట్టు తెలిపాడు. అయితే నిందితుడు ఎనిమిది మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడి వారిని హతమార్చినట్టు దర్యాప్తులో తేలింది. మృతుల్లో టీనేజర్లు కూడా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. హత్య చేసిన అనంతరం షిరైషి వారి శరీరాలను ముక్కలుగా నరికి బాక్సుల్లో పేర్చి పెట్టినట్టు తెలిపారు.
ఈ భయానక హత్యలతో అతడు ట్విటర్ కిల్లర్గా సోషల్ మీడియాలో వైరల్గా మారాడు. కేసు దర్యాప్తు అనంతరం 2020లోషిరైషికి అక్కడి అధికారులు మరణశిక్ష విధించారు. జపాన్లో విధిస్తున్న మరణశిక్షలను రద్దు చేయాలని అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో మూడేళ్లుగా ఉరిశిక్షలు విధించడాన్ని అక్కడి అధికారులు నిలిపివేశారు. మూడేళ్ల తర్వాత శుక్రవారం టోక్యో డిటెన్షన్ హౌస్లో షిరైషిని ఉరితీసినట్టు అధికారులు వెల్లడించారు. అతడి ఉరిశిక్ష అమలు చేసేవరకు ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదని తెలిపారు.