Thursday, May 2, 2024

జవహర్ నవోదయ స్కూళ్లలో ఆరవ తరగతికి ప్రవేశాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశంలోని 649 సీట్ల భర్తీకి రెండు విడతల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా నవంబర్ 4 ఉదయం 11.30 గంటలకు పర్వత ప్రాంతాల్లో 2024 జనవరి 20వ తేదీన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఈ పరీక్షకు అర్హులైన విద్యార్థులు ఆగస్టు 10వరకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది.

ప్రవేశాలకు అర్హత : ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. వారు 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలడ్లోనే చదివి ఉండాలి. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు.

విద్యార్థుల వయస్సు : దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మే 1. 2012 నుంచి జులై 31, 2014 మధ్యలో జన్మించిన వారై ఉండాలి.
ప్రవేశ పరీక్ష : జవహర్ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు (మెంటల్ ఎబిలిటీ, అరిథెమెటిక్, లాంగ్వేజ్). ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు 2 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో JNV అధికారిక వెబ్‌సైట్ https://navodaya.gov.in/tvs/en/Homel ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దృవీకరించిన సర్టిఫికెట్ సాఫ్ట్ కాపీని అప్‌లోడ్ చేయడం తప్పనిసరిని. దీంతో పాటు అభ్యర్థి ఫొటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్ వివరాలు, నివాస దృవపత్రాలు అవసరం ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు. రెండు విడతల్లో నిర్వహించే ఈ పరీక్ష ఫలితాలను వచ్చే ఏడాది మార్చి/ఏప్రిల్లో విడుదల చేసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News