Monday, May 13, 2024

కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన జిట్టా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో జిట్టా బాలకృష్ణారెడ్డి హస్తం తీర్థం పుచ్చుకున్నారు. శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కండువా కప్పి కోమటిరెడ్డి ఆహ్వానించారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ మనస్ఫూర్తిగా జిట్టాను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీ పెట్టినప్పుడు కెసిఆర్ వెంటన నడిచిన కొద్ది మంది నేతల్లో జిట్టా ఒకరని కోమటిరెడ్డి వెల్లడించారు. జిట్టా చేరికతో భువనగిరిలో పార్టీకి మరింత బలం పెరిగిందని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 కు 12 సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News