Friday, September 19, 2025

మూడు రోజుల పాటు ప్రచారానికి కెసిఆర్ విరామం…..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూడు రోజుల పాటు ప్రచారానికి కెసిఆర్ విరామం ఇచ్చారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో సిఎం కెసిఆర్ బిజీబీజీగా గడిపారు. ప్రస్తుత సర్వేలపై ఆయన సమీక్షలు జరుపుతున్నారు. నియోజకవర్గాల ఇంఛార్జీలను ఫామ్‌హౌజ్‌కు రప్పించుకొని చర్చలు జరిపారు. కాంగ్రెస్, బిజెపి సీనియర్ నేతల స్థానాల్లో పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. నియోజకవర్గాల్లోని పార్టీ అభ్యర్థులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా ఆశీర్వాద సభలపై కూడా ఆరా తీశారు. నామినేషన్లలో అసంతృప్తి నేతలపై చర్చలు జరిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News