Saturday, July 27, 2024

కేజ్రీవాల్‌కు దక్కని ఊరట… మరికొన్ని రోజులు జైల్లోనే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై తక్షణం విచారణ చేపట్టేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం, విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. మరోవైపు ఆయన జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు. దీంతో మరికొన్ని రోజులు ఆయన జైల్లోనే ఉండనున్నారు. మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఇటీవల ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. దీన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సిఎం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం, ఈడీకి నోటీసులు జారీ చేసింది.

దీనిపై ఏప్రిల్ 24 లోగా తమ స్పందన తెలియజేయాలని దర్యాప్తు సంస్థను ఆదేశించింది. దీనిపై ఏప్రిల్ 29 తరువాత విచారణ నిర్వహిస్తామని వెల్లడించింది. 202122 నాటి ఢిల్లీ మద్యం విధానంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసులో ఆయనకు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఆ కస్టడీ సోమవారంతో ముగియడంతో సీఎంను వీడియో కాన్ఫరెన్సు ద్వారా కోర్టు ఎదుట హాజరు పరిచారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున సీఎంను మరికొన్ని రోజుల పాటు కస్టడీ లోనే ఉంచాలని ఈడీ కోర్టును కోరింది. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం ఏప్రిల్ 23 వరకు కస్టడీని పొడిగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News