మొన్నటి వరకు ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడిపిన మహేష్ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో హాలీ డే ట్రిప్ను ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ పిల్లలతో ఎం జాయ్ చేస్తున్న ఫొటోలను నమ్రత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. ఇక ఈ సమయంలో మహేష్ బాబు 27వ చిత్రానికి సంబంధించిన వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’కి దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి ప్రస్తుతం ఈ సూపర్స్టార్ 27వ చిత్రానికి స్క్రిప్ట్ను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.
సమ్మర్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు కొత్త మూవీ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి హీరోయిన్గా ఇంకా ఎవరు ఖరారు కాలేదు. కానీ నమ్రత మాత్రం ఈ చిత్రం కోసం కియారా అద్వానీని హీరోయిన్గా తీసుకోవాలంటూ దర్శకుడు వంశీ పైడిపల్లికి రికమండ్ చేసినట్లుగా తెలిసింది. తన భర్తకు కియారా అద్వానీ అయితేనే సరైన జోడీ అని ఆమె భావిస్తోందట. ఎత్తు, కలర్తో పాటు చాలా విషయాల్లో కూడా మహేష్కు కియారా సరైన జోడీ అంటూ ఆమె ‘భరత్ అనే నేను’ చిత్రం సమయంలోనే చెప్పింది. ఆ చిత్రంలో మహేష్, కియారాల జోడీకి మంచి మార్కులు పడ్డాయి. అందుకే మరోసారి వీరిద్దరి కాంబోను సెట్ చేయాల్సిందిగా వంశీ పైడిపల్లికి నమ్రత సలహా ఇచ్చిందట. దీంతో మహేష్ 27వ చిత్రంలో కియారా అద్వానీ నటించడం ఖరారైనట్టేనని అంటున్నారు.
kiara advani will be perfect for mahesh babu says namrata