Saturday, July 27, 2024

మానవత్వం చాటుకున్న మంత్రి కొప్పుల

- Advertisement -
- Advertisement -

ధర్మారం: మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఇంజపురి కనకయ్య అనే తాపీ మేస్త్రీ గత వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, సదరు బాధిత కుటుంబ పరిస్థితిని స్థానిక వార్డు సభ్యుడు శాతరాజుల సుమన్, మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ మేరకు బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించి మంత్రి ఆదుకున్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News