Thursday, April 25, 2024

రేవంత్, బండి సంజయ్‌లపై కెటిఆర్ లీగల్ నోటీసులు.. రూ.100 కోట్ల పరువు నష్టం దావా..

- Advertisement -
- Advertisement -

రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి కెటిఆర్ లీగల్ నోటీసులు
రూ.100 కోట్ల మేర పరువు నష్టం దావా నోటీసులు
ఇప్పటికే చేసిన వ్యాఖ్యలపై వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్న కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బిజెపి నాయకులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి కె. తారక రామారావు లీగల్ నోటీసులు పంపారు. టిఎస్‌పిఎస్సీ వ్యవహారంలో రాజకీయ దురుద్ధేశంతోనే తన పేరును అనవసరంగా లాగుతున్నారని వీరిద్దరికి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులను పంపించారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు పదేపదే అబద్ధాలను మాట్లాడుతున్నారన్నారని కెటిఆర్ తెలిపారు.

కేవలం ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటివారి పైన అసత్య ప్రేలాపనాలు చేసే హక్కు వీరికి లేదని పేర్కొన్న కెటిఆర్, ఇండియన్ పీనల్ కోడ్‌లోని 499, 500 నిబంధనల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులను లాయర్ ద్వారా పంపించారు. ఎలాంటి ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలను మానుకోవాలని, ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో కెటిఆర్ డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా తమ వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పకుంటే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావాను ఎదుర్కొవాల్సి వస్తుందని కెటిఆర్ తన నోటీసులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు చేసిన నిరాధార ఆరోపణలను సాక్షాలతో సహా తన నోటీసుల్లో కెటిఆర్ ప్రస్తావించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News