Sunday, June 16, 2024

పోదాం పద సర్కారు దవాఖానకు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే దుస్థితి నుండి పోదాం పద సర్కారు దవాఖానకే అనే ధీమాను కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కెటిఆర్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. జననం నుండి మరణం దాకా, ప్రతి దశలో మన సర్కారున్నది అనే గొప్ప భరోసా తీసుకొచ్చామని, కెసిఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు డయాలసిస్ సెంటర్లు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు బస్తీ దవాఖానలు, మాతాశిశు ఆసుపత్రులు నగరం నలుమూలలా నిర్మాణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించామన్నారు. వరంగల్ నడిబొడ్డున దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖానా ఏర్పాటు చేశామని, జనాభా దామాషాలో మరే రాష్ట్రంలో లేనన్ని మెడికల్ సీట్లు వచ్చాయని, ఒకటా? రెండా? కెసిఆర్ పాలనలో వైద్య ఆరోగ్య రంగం దేశ చరిత్రలోనే ఒక అరుదైన విప్లవమని కెటిఆర్ ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News