- Advertisement -
తెలంగాణ రాష్ట్రం దివాలా తీయలేదు
మేధోపరంగా, నైతికంగా కాంగ్రెస్ దివాలా తీసింది
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
నేడు మ.12 గంటలకు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై
కెటిఆర్ మీడియా సమావేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రం దివాలా తీయలేదు మిస్టర్ ‘చీప్ మినిస్టర్’ అంటూ ట్వీట్ చేశారు. నిజానికి మేధోపరంగా దివాలా తీసింది, నైతికంగా దిగజారింది మీరూ, మీ అవినీతి కాంగ్రెస్ పార్టీయే అంటూ ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కెటిఆర్ తెలిపారు.
- Advertisement -