పుణే: చివరి ట్వంటీ20 కోసం టీమిండియా క్రికెటర్లు బుధవారం పుణే చేరుకున్నారు. శ్రీలంక భారత్ జట్ల మధ్య శుక్రవారం పుణేలో చివరి ట్వంటీ20 జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు పుణే చేరారు. ఇండోర్లో జరిగిన రెండో టి20లో విజయం సాధించిన విరాట్ కోహ్లి సేన సమరోత్సాహంతో కనిపిస్తోంది. చివరి మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా జట్టు సభ్యులందరూ ప్రత్యేక విమానంలో పుణేకు వచ్చారు. భారత ఆటగాళ్లకు ఇక్కడి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. కాగా, శ్రీలంక జట్టుకు ఈ మ్యాచ్ సవాలుగా మారింది. సిరీస్ను సమం చేయాలంటే ఇందులో తప్పక గెలవాల్సిందే. దీంతో లంక కూడా మ్యాచ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారత్పై ప్రతీకారం తీర్చుకుని సిరీస్ను సమంగా ముగించాలని భావిస్తోంది. అయితే ఇందులో ఎంత వరకు సఫలం అవుతుందో చెప్పడం కష్టమే.