Sunday, April 28, 2024

మల్లన్నసాగర్ ‘టు’ తపాస్‌పల్లి లింక్ కాలువ

- Advertisement -
- Advertisement -

Link canal from Mallannasagar reservoir to Tapas Palli reservoir

పలు సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధుల విడుదల
మరిన్ని నూతన ప్రాజెక్టులకు
మంత్రివర్గం ఆమోదం

మన తెలంగాణ/హైదరాబాద్: సిద్ధిపేట జిల్లాలో మల్లన్నసాగర్ జలాశయం నుంచి తపాస్ పల్లి జలాశయానికి లింక్ కాలువ తవ్వకానికి రూ.388.20 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తపాస్‌పల్లి జలాశయం కింద సిద్దిపే ట జిల్లాలో 1,29,630 ఎకరాలకు నికరమైన సాగునీరు అందనున్నది. వనపర్తి జిల్లాలో గోపాల్ పేట మండలం, బుద్దారం గ్రామంలో ఉన్న పెద్దచెరువు పునరుద్ధరణ పనులకు రూ. 44.71 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపో తల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన ఘన్‌పూర్ బ్రాంచి కాలువ పనులకు రూ.144. 43 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కాలువ ద్వారా ఘన్‌పూర్ మరియు అడ్డాకుల మండలాల్లో 25వేల ఎకరాలకు సాగునీరు అందించాలని తలపెట్టింది.

ఆదిలాబాద్ జిల్లా లో పెన్ గంగా నదిపై నిర్మాణం అవుతున్న చనాకా కోరాటా బ్యారేజీకి సంబంధించి రూ. 795.94 కోట్లకు అంచనా వ్యయాన్ని సవరిం చడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రా జెక్టులో ఇప్పటికే బ్యారేజీ నిర్మాణం పూర్తి కా గా, పంప్‌హౌస్ నిర్మాణం కొనసాగుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో భీమ్ పూ ర్, జైనథ్, భేలా, ఆదిలాబాద్ మండలాల్లో 50 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది. మెదక్ జిల్లాలో నిజాం కాలంలో నిర్మించబడిన ఘన్‌పూర్ ఆనకట్ట కాలువల వ్యవస్థను గతంలో ఆధునీకరించడం జరిగింది. అందులో మిగిలి పోయిన మరికొన్ని పనులను చేపట్టడానికి రూ.50.32 కోట్లతో పరిపాలనా అనుమతిని మంత్రివర్గం ఆమోదించింది.

ఈ ప్రాజెక్టు కింద మెదక్ జిల్లాలో సుమారు 25 వేల ఎకరాలకు సాగు నీరు అందించనుంది. అలాగే వనపర్తి, గ ద్వాల జిల్లాల్లో 11 చెక్ డ్యాంల నిర్మాణానికి రూ. 27.36 కోట్లతో పరిపాలనా అనుమతిని మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. వనపర్తి జిల్లాలో పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ఉన్న గోపాల సముద్రం చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనుల కోసం రూ.10.01 కోట్లు మంజూరు చేసింది. గద్వాల జిల్లాలో ప్రతిపాదించిన నలసోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకానికి సవరించిన అంచనా వ్యయం రూ.669 కోట్లకు అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలవడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సూర్యాపేట జిల్లాలో చింతలపాలెం మండలం, వెల్లటూరు గ్రామం వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ నుంచి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకానికి, పాల్కేడ్ మండలం గుండెబోయిన గూడెం గ్రామం వద్ద జాన్ పహాడ్ బ్రాంచ్ కెనాల్ నుండి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకాలకు రూ.16.23 కోట్లకు మంత్రి వర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధుల సేకరణకై కంపనీస్ యాక్ 2013 ప్రకారం మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటును మంత్రివర్గం ఆమోదించింది. ఈ కార్పొరేషన్ కు ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ లేదా ప్రిన్సిపల్ సెక్రెటరీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇఎన్‌సి (జనరల్), ఇఎన్‌సి (గజ్వేల్), ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి, ఇరిగేషన్ శాఖ సంయుక్త కార్యదర్శి, సంగారెడ్డి చీఫ్ ఇంజనీర్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. దేవాదుల పథకంలో భాగంగా ఎత్తయిన ప్రాంతాలకు సాగు నీరు అందించడానికి గండి రామారం చెరువు నుంచి కన్నారం చెరువు వరకు పంప్ హౌజ్, కాలువ పనులకు గుండ్ల సాగర్ నుంచి లౌక్య తండా వరకు పైప్ లైన్ పనులకు నశ్కల్ జలాశయం వద్ద పంప్ హౌజ్ నిర్మాణానికి మొత్తం రూ. 104.92 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News