Saturday, April 20, 2024

రైల్వే ట్రాక్‌పై ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

Love couple suicide attempt on railway track

విశాఖ: జిల్లాలోని పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధి సత్తివానిపాలెం శనివారం విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట రైల్వే ట్రాక్‌ పై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన ప్రేమ జంటను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రియురాలు మృతి చెందగా, ప్రియుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రియుడు కోటనరవ ప్రాంతానికి చెందిన కుమార్‌ గా, యువతిని కొణతాల హేమగా రైల్వే పోలీసులు గుర్తించారు. హేమకు గతంలో వేరే వ్యక్తితో వివాహ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News